Sunday, March 6, 2011

A Clarion Call by Telangana Women

Telangana Women Shows The Way .

ఇల్లు, పిల్లలు, కుటుంబ సంసార బద్యతలోనే కాదు పోరు బాటలో సైతం ముందు ఉంటామన్నట్టు శుక్రవారం జర్గిన సమరభేరి సభ ద్వార తెలంగాణా మహిళలు గర్జించినారు , ఉద్యమ బట లో ముందు వరుస లో నిల్చున్తామని ప్రకతిన్చిండ్రు. రాణి రుద్రమ దేవి ని కన్నా గడ్డ  వరంగల్ మరో సారి సమర భేరి మోగించింది . తెలంగాణా పోరు  బాటలో  మేము  సైతం అంటూ వరంగల్ లో వేలాది మహిళలు కదం తొక్కినారు. ఓరుగల్లు మహిళా సమర భేరి కోసం మహిళలు పల్లె పల్లె నుంచి తరలి వచ్చినారు. “జై తెలంగాణా” నినాదాల తో, ఆట పాట తో సభ లో ఉద్యమ స్ఫూర్తి ని రగిలిన్చినారు . మేము అబలలం కాదు తెలంగాణా అగ్గి రావ్వలమంటూ పిదికలు బిగించి ఒకే గొంతుకతో నినదిన్చిండ్రు .

వేలాదిగా మహిళలు ఒక్క ఉద్యమ పిలుపు తో దండుకట్టి వచ్చి , పోరాటాల గడ్డ ఓరుగల్లులో మహిళలలు అన్నింటా ముండువుంటారని చాటి చెప్పినారు . నగర పుర వీదుల్లలో శోబయత్ర నిర్వహించినారు , కాసేపు ఇల్లు , సంసారం బాద్యతలను పక్కన పెట్టి దాదాపు 9 గంటలు తెలంగాణా గొంతు ని నలుగు దిక్కులు పిక్కటిల్లేలా నినదిన్చిండ్రు.

సభ లో రాయునిగుడెం లో కేవలం 4 అమ్మాయిలు సీమంధ్ర ముఖ్యమంత్రి ని  3 నిమిషాలో పారదోలిన గటనను స్మరించుకున్నారు . అదే స్పూర్తి తో తెలంగాణా ఉద్యమంలో ముందుకు నడువాలని తీర్మానించారు . రాణి రుద్రమ దేవి. సమ్మక్క-సారక్క , చాకలి ఐలమ్మబిడ్డలుగా పోరు చేసి ప్రత్యెక రాష్రంను సాదిన్చుకుందాం అని ప్రతిన పునిండ్రు .

సభ లో తెలంగాణా పట్ల కాంగ్రెస్ పార్టి వైఖరి ఏంటి ఆ పార్టి స్పష్టం చేయాలనీ డిమాండ్ చేసిండ్రు . గత 60 సంవత్సరాలుగా తెలంగాణా ఫై స్పష్టమైన వైకరి తెలుపకుండా రాష్ట్ర ఎరుపటును అడ్డుకుంటున్నది కాంగ్రెస్సే అని ఆరోపించిండ్రు . ఇక్కడ లొల్లి చేస్తేనే డిల్లి లో బిల్లు పెడుతారని, గత పది సంవత్సరాలుగా గాంధీ మార్గంలో శాంతియుత మార్గం లో ఉద్యమం చేస్తుంటే తెలంగాణా వాదుల ఫై పొలిసులను ఉసిగొల్పుతున్నారని , ఇక గాంధీ మార్గం వదిలి మేము సైతం గాడ్సే లాగా ఉద్యమిస్తే ప్రాంతం లో ఒక్క సీమంద్ర వాడుకుడా ఉండదని పెర్కున్నారు.

సభకు మహిళలు పెద్ద సంక్యలో నెత్తి ఫై బతుకమ్మలు, బోనాలను తీసుకొని వచ్చారు . కల బృందాలు అట-పాట లతో హోరేతిన్చినారు . తెలంగాణా కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు . అమరవీరుల బాటల నడుస్తూ ఉద్యమానికి పునరంకితం అవుతామని పిడికల్లు బిగించి నినదిన్చినారు . నెల 23 తేదిని డెడ్ లైన్ విదిస్తున్నామని , తర్వాత తెలంగాణాకు ద్రోహం చేస్తున్న సీమంధ్ర పాలకులను, పెట్టుబడిదారులను హైదరాబాదు నుండి తరిమేస్తామని అన్నారు .

1 comment:

  1. Anna chala manchiga seemandravari javabu cheppavu valla kullu jathi guring chala chala baga gaddipettavu very very thank q

    ReplyDelete