Friday, August 28, 2015

Integral Education Part IV: True education is about character building .

Man lives in various levels i.e., physical, mental, intellectual, moral and spiritual. True education should be aimed at developing all these levels simultaneously and harmoniously. The main essence should be to realise oneness .

Swami Vivekananda described education as " the manifestation of the perfection already in man) . In this one bewildering statement contains all we want to know about education.

What is perfection ? Is it the capacity to amass wealth, is it capacity to become and called as intellectual genius, is it capacity to dominate others amd make them tread our path ???

We normally think of excellence or perfection in terms of outshine others. But perfection is far more than this. True education should awaken the vital aspects so that one can become stronger and nobler. The most vital aspect of education is the building of a a strong character.

Wednesday, August 19, 2015

JambuDwipa : Decoding Hindu texts






జంబుద్వీపం: హిందూ జ్వాల

సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.
అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?

జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:
1) కేతుముల వర్ష
2) హరి వర్ష
3) ఇలవ్రిత వర్ష
4) కురు వర్ష
5) హిరణ్యక వర్ష
6) రమ్యక వర్ష
7) కింపురుష వర్ష
8 ) భద్రస్వ వర్ష
(స్పష్టంగా అవగాహన రావడానికి చిత్రాన్ని చూడండి. Check the picture for clear idea.)
పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.

ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.
మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.

దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !

మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో ఇటువంతి అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను భోదిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని భోదిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను భోదించడం లేదు.

మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు కొన్ని కుహానా లౌకికవాద పార్టీలు(Pseudo secular political parties) విద్యావ్యవస్థను కాషాయమయం(Saffronisation) చేయొద్దని తిరస్కరించాయి.  వోటు బ్యాంకు కొసం తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?

For English click >> Link

.

Thursday, August 6, 2015

Fight against Lord Krishna look alike NTR statues in Andhra.

కృష్ణుడిగా ఎన్‌టిఆర్ ఎంత గుర్తు ఉంటాడో అంతే రావణ బ్రహ్మగా కూడా మనకి ఆయనే కనుక ఈసారి అందరం రావణుడి వేషంలో ఉన్న ఎన్‌టిఆర్ బొమ్మలని తగలెడదాం.

ఎన్టీఆర్ ని కృష్ణుడి రూపంలో గోదావరి ఒడ్డుపై విగ్రహం ప్రతిష్టించడం తప్పు కాదనే వారికి ఈ పోస్టింగ్ ప్రత్యేకం.
తెలుగు ప్రజలకు రాముడన్నా, కృష్ణుడన్నా ఎన్టీఆర్ తప్ప మరొకరి రూపం కనపడదు. అంత అద్భుతమైన నటనా కౌశల్యం, ఆహార్యం మరొకరి లో కనపడవు. కానీ, ఇది సినిమాల వరకూ మాత్రమే. అలాగని గుళ్లోనూ, గోపురాల్లోనూ, లేదా ఇలా పబ్లిక్ ప్లేస్ ల లోనూ దేవుళ్ళ రూపంలో ఆ నటుడి విగ్రహాలు ప్రతిష్టించడం కరెక్ట్ కాదు. అది ఒకరకంగా ఎంతోమంది హిందువుల మనోభావాలను దేబ్బతీసినట్లే.

అయితే కొందరంటున్నట్లు మరెవరినీ ఆ దేవుళ్ళ రూపంలో ఊహించుకోలేము కాబట్టి తప్పులేదు అంటున్నారు. అదే నిజమనుకుందాం. ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడి గానే కాదు. రావణబ్రహ్మ గా అద్భుతంగా నటించారు. అలా అనిచెప్పి ఆయనంటే ఇష్టం లేని వారెవరైనా దసరా (విజయ దశమి) నాడు జరిపే రావణాసురిడి దహన కార్యక్రమాలకి ఎన్టీఆర్ రూపం తో చేసినవి పెట్టి తగులపెడితే దానికి మీరు ఒప్పుకుంటారా?

నటుడిగా ఎన్టీఆర్ ని అభిమానించని వారు వుండరు. మీరు చేస్తున్న పనివల్ల ఆ మహానటుడికి లేనిపోని అవమానాలు కలుగుతున్నాయి. ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే అభిమానం ఉండొచ్చు. కానీ, అది హద్దులు దాటకూడదు. ఇది అన్ని రాజకీయ పార్టీలకూ వర్తిస్తుంది

~Hindu Jwala