Sunday, April 17, 2016

An Incident where people in train united against communist's anti-Hindu slogans


కమ్యూనిస్టులకు పరాభవం..
14.04.2016, శాతవాహన ఎక్స్ప్రెస్..
సికింద్రాబాద్ నుండి ఖమ్మం వెళ్తున్నాను.
PDSU కార్యకర్తల గుంపు ఒకటి చొరబడి "విద్య కాషాయీకరణ అడ్డుకోవాలి, హిందూ మతోన్మాదం నశించాలి" అంటూ ఏవో గాలి పాటలు పాడుతున్నారు.
ఆ గుంపులో ఒక అమ్మాయి కూడా ఉంది.
"ఇటురా అమ్మా.. నీ వయసు ఎంత" అని అడిగితే 14ఏళ్ళు అని చెప్పింది.
"హిందూ మతోన్మాదం అంటే ఏమిటో నాకు కాస్త వివరించు" అన్నాను.
"ఏమో అన్నా.. " అనగానే ఇతర కమ్మీగాళ్ళు వచ్చి నాకు వివరించడానికి try చేసారు.

"నువ్వు మాట్లాడకు.. నేను ఆ అమ్మాయిని అడుగుతున్నా" అనగానే నాకు మద్దతుగా ఖాసిం అనే సహ ప్రయాణికుడు వచ్చాడు.
"అన్ని మతాలు ఉండగా హిందూ మతోన్మాదం ఎందుకంటున్నారు" అని అతను ప్రశ్నించగానే..
"వాళ్ళు ముస్లిములను చంపితున్నారు.. JNU లో అలజడి సృష్టించారు" అనగానే అతను.. "నేనూ ముస్లింనే.. మీరు చెప్పేది పచ్చి అబద్దం.. రంగనాయకమ్మ రామాయణవిషవృక్షం రాస్తే ఎవరు ఏమీ అనలేదు. తస్లీమా నస్రీన్ లజ్జా రాసిందని ఒవైసీ దాడి చేసినా మీరు స్పందించలేదు. JNUలో స్టూడెంట్స్ చేసినవి anti-national activities " అనగానే వాళ్లకు నోట మాటలేదు.
ఇక ప్రయాణికులు ఏకమయ్యారు. వారు వేరే కంపార్టుమెంటుకు పారిపోయారు.

Content : HinduJwala

No comments: