Tuesday, January 31, 2012

Today Bhishma Ashtami

Today is Bhishma Ashtami . Grand Old man of Mahabharata Sri Bhishmacharya's soul left his body today . After 18 days of Kurukshetra War, Bhishma waits for Uttarayana period and chose this day to leave his body . He had a boon granted by his father that he can die whenever he wishes. Bhishma waits till Ratha-Saptami to see Surya Narayana chariot turn towards North hemishphere and next day on "Ashtami" he chooses to leave for the eternal world .
 
మహాభారతము లో భీష్ముడు నా హీరో . తన తండ్రి కి ఇచ్చిన మాట కొరకు , హస్తినపురము సింహాసన రక్షణ కొరకు వారు చేసిన త్యాగము అమెఘమైనది . 18 రోజుల కురుక్షేత్ర యుద్దము అనంతరము , అంపశయ్య ఫై ఉన్న భీష్ముడి వద్దకు శ్రీ కృష్ణుడు ద్రౌపది తో సహా పాండవులను తీసుకొని వెళ్తాడు . అప్పుడు రెండు సంగటనలు నన్ను అమ్మేతంగా ఆకర్షించాయి .

ఒక్కటి కృష్ణుడి ని చుసిన భీష్ముడు చాల దీనంగా అర్దించడం నన్ను ఆశర్యానికి గురిచేసింది .
రెండోది పాండవులకు ధర్మ సూక్తులు చెప్పుతున్నపుడు ద్రౌపది గట్టిగ నవ్వుతుంది . ఆ నవ్వు కు అర్ధం తెలిసిన భీష్ముడు తనను క్షమించమని ద్రౌపది ని కోరుతాడు .

మొదటి విషయానికి వస్తే , నేను ఆ మద్య లో బమ్మెర పోతన్న గారి భాగవతము చదివాను. అందులో ఒక పద్యం లో భీష్ముడు తన అంతిమ శ్వాస వదలబోతు శ్రీ కృష్ణున్ని దీనంగా ప్రర్దిస్తాడట . " అయ్యా శ్రీ కృష్ణ , నేను ఆలు బిడ్డలు లేని వాడిని నా ఫై అదిక కరన్యము చూపుము అని ...." .

ఇది నిజామా అని నాకు సందేహం కలిగింది ?? పెళ్లి చేసుకోక పోవడం , భార్య ,పిల్లలు లేకపోవడం తన జీవితంలో లోటు గా భావించాడ భీష్ముడు ?? ఇది నిజంగా జర్గిందా , లేదా బమ్మెర పోతన గారు ఊహించి రాశారా ? నేను భాగవతము తెలిసిన వారిన్ అడిగాను , వారు కూడా నాకు సంత్రుప్తికారణమైన సమాదానం చెప్పలేదు . తన తండ్రి కి ఇచ్చిన మాట కోసం , తన సర్వసం త్యాగము చేసిన మహా పురుషుడు . తన తండ్రి సుఖము కొరకు , పెళ్లి చేసుకోను అని ప్రతిజ్ఞ చేసాడు , దాన్నే మనం " భీష్మ ప్రతిజ్ఞ " అంటాము . అంతటి మహా పురుషుడు తన ప్రాణాలు వదలోబోతు , తనకు బార్య - పిల్లలు లేరు అని కృష్ణున్ని అర్దిన్చాదంటే ఎందుకో మనసులో భాద గా ఉంది .

నా అనుమానము ఏమంటే , కవులకు ఊహ శక్తి ఎక్కువ . బమ్మెర పోతన గారు కూడా ఈ సంగాటనాను ఊహించి రాశారా అని ?

రెండో ఘటనకు వస్తే ధర్మరాజు కు రాజ - ధర్మ సూక్తులు చెప్పుతాడు అంపశయ్య ఫై ఉన్న భీష్ముడు . ఆ ధర్మ సూక్తులు చెప్పుతుంటే ద్రౌపది గట్టిగా నవ్వుతుంది . అప్పుడు ద్రౌపది ను ఉద్దేశించి " తల్లి నీవు ఎందుకు నవ్వావు అని అడుగుతాడు . అప్పుడు ద్రౌపది భీష్ముడి తో అంటుంది " మీరు ధర్మరాజు కు ఇన్ని ధర్మ నీతులు చెప్తున్నారు గా , నా వెంతుకలు పట్టుకొని భర-భర గుంజుకోస్తుంటే , నా వస్త్ర అపహర్ణ జర్గుతుంటే మీ ఈ ధర్మ సూక్తులు ఎమైనాయి ? అప్పుడు భీష్ముడు ఆంటాడు " నేను నా జీవితములో ఒకే ఒక తప్పు చేశాను , నా కాళ్ళ ముందు నీకు జర్గుతున్న అన్యాయాని అపకపోవతము . అందుకే ఇప్పుడు ఇలా అర్జునుడి బాణాలతోగుచ్చాబడ్డ ఈ అంపశయ్య ఫై పది శిక్షను అనుభవిస్తున్న "

భీష్ముడి మాటల్లో నాకు అర్దమైంది ఏమంటే , పాపమూ చేసే వాడు ఎంతటి శిక్షర్హుడో , పాపము ను సహించేవాడు కూడా అంతటి శిక్షను అనుభావిన్చాలిసిందే . జీవితము లో ఒక్క చిన్న తప్పును అపానందుకే భీష్ముడికి అంతటి శిక్ష పడితే , ప్రతి రోజు మనము చేసే తప్పులకు, పాపాలకు మన పరిస్తితి ఏంటో ???

No comments: